
కరోనా రెండో దశ ఉద్ధృతి కారణంగా… భారత్ సహా పలు దేశాల నుంచి విమాన సర్వీసులను రద్దు చేసిన జర్మనీ…. తాజాగా నిషేధాన్ని ఎత్తివేసింది. డెల్టా వేరియంట్ వెలుగుచూసిన ఐదు దేశాల నుంచి… విమాన సర్వీసులను తాత్కాలికంగా నిషేధించిన జర్మనీ…. బుధవారం నుంచి అనుమతి ఇచ్చింది. భారత్, నేపాల్, రష్యా, పోర్చుగల్, UK నుంచి విమాన సర్వీసులపై విధించిన ప్రయాణ నిషేధాన్ని ఎత్తి వేస్తున్నట్లు…. భారత్ లోని జర్మనీ రాయబారి వాల్టర్ ప్రకటించారు.
#NewsOfTheDay
#EtvTelangana
source